కలం, వెబ్ డెస్క్: నేపాల్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా (Balendra Shah)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా మోడీ ఓ పోస్ట్ చేశారు. నేపాల్ (Nepal) ప్రజలు బాలేంద్ర షా నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనమని పేర్కొన్నారు. భారత్-నేపాల్ మధ్య ఉన్న చిరకాల మిత్రత్వాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు బాలేంద్ర షాతో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
Read Also: పార్టీ లాంచింగ్ డేట్ ప్రకటించిన కవిత
Follow Us On: Instagram

