కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి అభినందనలు తెలియజేశారు. సీఎంగా, ప్రధానిగా కలిపి మొత్తం 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా సేవలందించి, దేశ చరిత్రలో సుదీర్ఘకాలం పదవిలో ఉన్న నేతగా మోడీ అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. ప్రజా సేవలో మోడీ సాధించిన ఈ చారిత్రక మైలురాయి ఆయన పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. దేశ సేవలో నిమగ్నమైన ప్రధానికి భవిష్యత్తులోనూ మరింత శక్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని జగన్ ఆకాంక్షించారు. జగన్తో పాటు ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

