సైకిలే వీల్ చైర్ గా మారింది.. ప్రభుత్వాస్పత్రిలో వృద్ధ దంపతుల పాట్లు

కలం, వెబ్​ డెస్క్​ : భారత దేశంలో నేటికి ప్రభుత్వాస్పత్రుల దుస్థితి మారడం లేదు. పేద ప్రజలకు చికిత్స అందించాల్సిన దవఖానాలు అరకొర వసతులతో అక్కున చేర్చుకోవడం లేదు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ (Madhya Pradesh)​ లోని ఓ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ఓ వృద్ధ దంపతులు పడిన అవస్థలకు సంబంధించిన వీడియో వైరల్​ అయింది. ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్​ చైర్లు అందుబాటులో లేకపోవడంతో రోగిని ఆమె భర్త సైకిల్​ పై తరలించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆస్పత్రి సిబ్బంది ఎలాంటి సహాయం అందించలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న దీన స్థితిని ఈ వీడియో వేలెత్తి చూపుతోంది. అయితే, ఈ సంఘటనపై ఆస్పత్రి అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయకపోయినా రోగులకు సకాలంలో వైద్య సహాయం అందించాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు.

Read Also: హర్మూజ్​కు ఆల్టర్నేట్​గా పైప్​లైన్​!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>