కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిచించిన నేపాలీ ముఠా (Nepali Theft Gang) దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. సికింద్రాబాద్ కౌకూర్లో రిటైర్డ్ ఆర్బిట్రేటర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నేపాలీ ముఠాకు చెందిన ప్రధాన నిందితులు మీనా, రాజేశ్, డేనియల్ చారో, కిరణ్ లను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సంబంధించిన వివరాలను సీపీ సుమతి మీడియాకు వెల్లడించారు.
సికింద్రాబాద్ కౌకూర్లో రిటైర్డ్ ఆర్బిట్రేటర్ ఇంట్లో నేపాల్ ముఠాకు చెందిన మీనా, రాజేష్ లు పనిమనిషిగా చేరారు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బీరువాలో ఉన్న కోట్ల విలువైన బంగారం, వెండి, డాలర్లు కాజేశారు. 5 రోజుల్లోనే 255 సీసీటీవీల ఆధారంగా చోరీ చేసిన నేపాలీ ముఠాను అరెస్ట్ చేశామని మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు.

