కలం, వెబ్ డెస్క్ : తాగిన మత్తులో కొందరు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలను చాలానే జరుగుతాయి. కానీ, విశాఖపట్నం (Visakhapatnam) లో ఓ నేవీ ఆఫీసర్ ట్రాఫిక్ ఎస్ఐపై దాడి చేశాడు. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మల్కాపురం ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)పైప్ పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణ అదే దారిలో వచ్చాడు. అక్కడే ట్రాఫిక్ నియంత్రిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ రావు.. కృష్ణను కారు ఆపాలని కోరారు.
దీంతో తాగి ఉన్న కృష్ణ కోపంతో వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా ఎస్ఐని కొట్టాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు నేవీ ఆఫీసర్ కు డ్రంక్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఎస్ఐ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు రాహుల్ కృష్ణపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా, బాధ్యత కలిగిన నేవీ అధికారి మద్యం తాగి పోలీసులపై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. Visakhapatnam లో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


