కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా నేడు లక్షలాది ఫోన్లలో వైబ్రేషన్ అలర్ట్ వచ్చింది. ఫ్లాష్ మెజేజ్ తో కూడిన సౌండ్ తో అలారం వినిపించింది. భవిష్యత్తులో ఏమైన విపత్తులు, భూకంపాలు సంభవించినప్పుడు ప్రజలను హెచ్చరించేందుకు NDMA (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ) టెస్టింగ్ వ్యవస్థను రూపొందించింది. ఇందులో భాగంగా నేడు అలారమ్ తో అలర్ట్ చేసింది. అత్యవసర హెచ్చరికల బలోపేతం కోసం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) అభివృద్ధి చేసిన స్వదేశీ సమీకృత హెచ్చరిక వ్యవస్థ (SACHET) ద్వారా అందించబడింది. 11.47 గంటలకు హైదరాబాద్ లోని ప్రజల ఫోన్లకు బీప్ ఫ్లాష్ సౌండ్ వచ్చింది.

