కలం, వెబ్డెస్క్: శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వృద్ధురాలు అర్ధరాత్రి షాపు ముందు వింత పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పసుపు, కుంకుమ, అగర్బత్తులతో అరగంట పాటు ఆ వృద్ధురాలు పూజ చేసింది. ఈ విజువల్స్ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఉదయం షాపు దగ్గరకు వచ్చి చూసిన యజమాని షాకయ్యాడు. భయంతో వృద్ధురాలి కోసం గాలించగా.. ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. దీంతో ఆమె మతిస్థిమితం లేని మహిళ అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: భయంకరమైన ఎల్ నినో.. మళ్లీ రాబోతుందా?
Follow Us On : WhatsApp

