కలం, వెబ్డెస్క్: శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వృద్ధురాలు అర్ధరాత్రి షాపు ముందు వింత పూజలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పసుపు, కుంకుమ, అగర్బత్తులతో అరగంట పాటు ఆ వృద్ధురాలు పూజ చేసింది. ఈ విజువల్స్ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఉదయం షాపు దగ్గరకు వచ్చి చూసిన యజమాని షాకయ్యాడు. భయంతో వృద్ధురాలి కోసం గాలించగా.. ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. దీంతో ఆమె మతిస్థిమితం లేని మహిళ అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

