కలం, వెబ్ డెస్క్ : నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) సూచించారు. శనివారం వరంగల్ లో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగుల కంటే మిర్చిబండి పెట్టుకున్నవారు ఎక్కువగా సంపాదించవచ్చని తెలిపారు.
గవర్నమెంట్ జాబ్ కంటే స్వయం ఉపాధి ద్వారా లక్షలు సంపాదించవచ్చని.. హైదరాబాద్లోని ప్రముఖ వ్యాపారాలైన పానీపూరి, గోకుల్ చాట్ కౌంటర్ ద్వారా రోజుకి లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. బజ్జీల బండి పెట్టుకోవడం కూడా ఒక ఉద్యోగమా? అని అంటున్నారని.. ఏ ఉద్యోగం లేకపోవడం కంటే స్వయంగా ఉపాధి పొందడం మంచిదేకదా అని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

