కలం, వెబ్ డెస్క్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తంబాకులో డ్రగ్స్ కలుపుకుని తింటున్నందుకే సైడ్ ఎఫెక్ట్ అయి వెంట్రుకలు ఊడిపోయి గుండు అయిందని ఆరోపించారు. కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేసిన క్రమంలో కౌశిక్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ కుమార్ కి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. బండి సంజయ్ కుమ్మక్కయారని ఆయన ఆరోపించారు.

