Mobile Popup Ad
Mobile Popup Ad

కార్మికులతోనే సమాజ అభివృద్ధి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో: దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి చెమట చుక్కలతోనే సమాజం ముందుకు సాగుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. ప్రతి రంగంలోనూ నిరంతరం శ్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తున్న కార్మికుల సేవలు అమూల్యమని ఆయ‌న కొనియాడారు. నేడు మేడే సంద‌ర్భంగా కార్మికులంద‌రికీ ప్ర‌భాక‌ర్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర, దుబ్బాక నియోజకవర్గం కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read Also: ఉగ్రముప్పుకు చెక్.. వందే భారత్ భద్రతకు ‘కోరాస్’ కమెండోల పహారా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>