కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Minister Azharuddin) కు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవేజ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also : గర్భిణీ మృతితో చర్చనీయాంశంగా ప్రభుత్వాసుపత్రులు
Follow Us On: Sharechat

