కలం, వెబ్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ (Messi) శనివారం కొల్కతాలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈవెంట్ ఆర్గనైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ’గోట్ టూర్ ఆఫ్ ఇండియా‘ లో భాగంగా మెస్సీ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొల్కతాలోని(Kolkata) సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. అయితే మెస్సీ స్టేడియం నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు గ్రౌండ్ లోపలికి విసిరేశారు.
మెస్సీ (Messi) వెళ్లిపోయిన అనంతరం గ్రౌండ్ లోకి వెళ్లిన ఫ్యాన్స్ ఆగ్రహంతో వస్తువులను విరగొట్టారు. మెస్సీ పర్యటనకు సరైన ఏర్పాట్లు చేయలేదని, టికెట్లు కొనుక్కుని వెళ్తే కనీసం మెస్సీని చూడకుండానే తిరిగొచ్చామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్ కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై ఆ రాష్ట్ర గవర్నర్ సీ.వీ ఆనంద్ బోస్ (C.V Anand Bose) ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై అంతకుముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) క్షమాపణలు చెప్పారు. సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొనడంతో మెస్సీకి, క్రీడాభిమానులకు సారి చెప్పారు. మెస్సీ టూర్ లో నిర్వహణ లోపంపై విచారణ కమిటీ వేస్తూ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల మార్గదర్శకాలు
Follow Us On: X(Twitter)


