Mobile Popup Ad
Mobile Popup Ad

26న నిజామాబాద్‌లో మెగా ఎక్స్ పోర్ట్ ప్రోగ్రాం

కలం, నిజామాబాద్ బ్యూరో: వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (DGFT), నిజామాబాద్ ‘జిల్లాను ఎగుమతి కేంద్రంగా’ (DEH) ప్రకటించిన కార్యక్రమానికి అవసరమైన చర్యలను అమలు చేయడానికి ఒక కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ ప్రచారం 120 ప్రాధాన్య జిల్లాలను కవర్ చేస్తుంది. వాటిలో నిజామాబాద్ ఒకటి. కొత్త ఎగుమతిదారులను సృష్టించడం, MSMEల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం జిల్లా స్థాయి ఎగుమతులను పెంచడం ద్వారా, DEH కార్యక్రమం కింద వేసిన సంస్థాగత పునాది పనులను ఎగుమతి ఫలితాలుగా మార్చడమే ఈ ప్రస్తుత ప్రచారం యొక్క లక్ష్యం.

ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన ఈ నెల 26న ఉదయం 09.30 గంటల నుండి నిజామాబాద్ కలెక్టరేట్‌లో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాన్ని (Mega Export Promotion) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు ఉత్పత్తిని ఎలా పెంచాలనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఈ-కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, వరి, సోయాబీన్, మొక్కజొన్న పత్తి పంటల మార్కెట్ వైవిధ్యీకరణపై ప్రదర్శనలు ఉంటాయి. ఈ విషయమై డీజీఎఫ్‌టీ అధికారులు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఈ సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలు ఉత్పత్తి పెంచే సూచనలు చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని రైతులు, ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>