కలం, వెబ్ డెస్క్: తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య లోక్సభ(Lok Sabha) రేపటికి వాయిదా పడింది. బడ్జెట్పై రెండో దఫా చర్చల్లో భాగంగా సోమవారం సమావేశమైన సభ పలుసార్లు వాయిదా అనంతరం మంగళవారానికి వాయిదా పడింది. పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్షాలు పట్టు పట్టడంతో సభ ప్రారంభమైన కాసేపటికే గందరగోళం నెలకొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటన చేస్తుండగా, పూర్తి స్థాయిలో చర్చ జరగగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీనిపై సమాధానం రాకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.
దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి, ప్లకార్డులతో నిరసన తెలపడంతో సభ పలుసార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30గంటలకు సభను (Lok Sabha) రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు సభ సమావేశం కానుంది. పశ్చిమాసియా యుద్ధంతోపాటు, స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తొలగింపు తీర్మానంపైనా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: సీఎంఆర్ ఎగవేత కేసులో యాక్షన్ స్టార్ట్
Follow Us On: Facebook

