epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేవంత్​ మనవడితో మెస్సీ ఫుట్​ బాల్​

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో ’అపర్ణ మెస్సీ టీమ్​ వర్సెస్ సింగరేణి ఆర్​ఆర్​ టీమ్‘ ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్​ జరిగింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న లియోనల్​ మెస్సీ (Lionel Messi) నేరుగా ఫలక్నూమా ప్యాలెస్​ కు చేరుకున్నారు. ఆ తరువాత ఉప్పల్​ స్టేడియంలో సీఎం రేవంత్​ రెడ్డితో (Revanth Reddy) మెస్సీ ఫుట్​ బాల్​ ఆడారు. ఈ సమయంలో రేవంత్​ తన మనవడిని తీసుకొచ్చి సరదాగా మెస్సీతో ఫుట్​ బాల్​ ఆడించారు. అలాగే, ఫోటో కూడా తీసుకున్నారు. సీఎం మనవడు మెస్సీతో ఆడిన విజువల్స్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి.

కాగా, ఉప్పల్​ లో జరిగిన మెస్సీ (Lionel Messi) ఫ్రెండ్లీ ఫుట్​ బాల్​ మ్యాచ్​ ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెస్సి గ్రౌండ్​ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వెళ్లిపోయేంత వరకు అభిమానులు ఆయనను చూస్తూ ఉండిపోయారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తో పాటు తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఇతర మంత్రులు హాజరయ్యారు.

Read Also: రాహుల్‌తో కలిసి ఢిల్లీకి సీఎం రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>