కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ(Delhi)లో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారిపోతోంది. ఈ రోజు సాయంత్రం నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి (AQI) 400 మార్కును దాటింది. దీంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) అధికారులు కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేశారు. గ్రేడెడ్ యాక్షన్ రెస్పాన్స్ ప్లాన్ (GRAP) లోని స్టేజ్ -IV నిబంధనలను శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సాయంత్రం 4 గంటలకు 431గా ఉన్న AQI సాయంత్రం 6 గంటలకు 441కు చేరింది.
దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారి కాలుష్య స్థాయులు Severe+ దాటే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లోని స్టేజ్ III నిబంధనలు అమలులోకి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే పరిస్థితి మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఢిల్లీ(Delhi)లో ఎయిర్ ఎమర్జెన్సీ (Air Emergency) ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో కాలుష్య స్థాయి పెరగకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?
Follow Us On: Pinterest


