కలం, వెబ్డెస్క్: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav ) మనవడు ఆదిత్య యాదవ్ (18) సింగపూర్ సైన్యంలో చేరాడు. ఈ మేరకు ఆదిత్య తల్లిదండ్రులు రోహిణి ఆచార్య, సమరేశ్ సింగ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కుమారుడి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు. అయితే, ఆదిత్య సింగపూర్ మిలట్రీలో సైనికుడిగా చేరడం లేదు. సింగపూర్ పౌరులు ఎవరైనా సరే 18 ఏళ్లు నిండిన తర్వాత సైన్యంలో రెండేళ్లు బేసిక్ మిలట్రీ ట్రైనింగ్(బీఎంటీ) శిక్షణ పొందాలి. ఇది సింగపూర్ పౌరసత్వ నిబంధనల ప్రకారం తయారుచేసిన నేషనల్ సర్వీస్(ఎన్ఎస్)లో భాగం.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆదిత్య సింగపూర్ సైన్యంలో చేరాడు. రెండేళ్ల పాటు క్రమశిక్షణ, విలువలు, ఓర్పు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోనున్నాడు. అలాగే శారీరక దృఢత్వం, డ్రిల్స్, ఆయుధాల వాడకం, ఫీల్డ్ ఎక్సర్సైజెస్ వంటి వాటిలో శిక్షణ పొందనున్నాడు. సింగపూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్, సింగపూర్ పోలీస్ ఫోర్స్లో తన రెండేళ్ల శిక్షణ కాలం పూర్తిచేయనున్నాడు. కాగా, లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav), రబ్రీదేవి దంపతులకు మొత్తం తొమ్మిది మంది సంతానం. అందులో రోహిణి ఆచార్య రెండో వ్యక్తి.
Read Also: కుక్క కరిచే మూడ్ గుర్తించలేం.. వీధికుక్కలపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


