కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగర పరిధిలో గల వెలుగుమెట్ల కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎక్స్ వేదికగా సోమవారం తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని, అందుకే ఖమ్మం (Khammam)లో కాంగ్రెస్ ప్రభుత్వం 700 ఇళ్లను కూల్చేసి 3,000 మందిని నిరాశ్రయులను చేసిందన్నారు. బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుందన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలన్నారు. పేదల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన కాంగ్రెస్, కేరళలో ప్రజలకు అండగా నిలబడతామని చెప్పడం సిగ్గుచేటని కేరళ సీఎం విమర్శించారు.

