కలం, వెబ్ డెస్క్ : జగిత్యాలలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విరుచుకపడ్డారు. ‘మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే లాగులు పగిలేదాక సంపాలే.. పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలని కోరుకుంటున్నాడని.. నేను చచ్చేరకం కాదు.. మీరు వెయ్యి జన్మలు ఎత్తిన నేను చావును నా కొడకా ఏం అనుకుంటున్నావో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిల్లి శాపాలకు చస్తామా.. అని ప్రశ్నించారు. చివరి శ్వాస ఉన్నంత వరకుఏ ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు కంటి రెప్ప కూడా పోకుండా కరెంట్ సరఫరా చేశామని.. 20 వేల మెగావాట్ల వరకు విద్యుత్తు సౌకర్యం కల్పించామన్నారు. మరి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటప్పుడే.. వీళ్లు గెలిస్తే.. రైతు బంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీం అంటారని చిలక్కు చెప్పినట్లు చెప్పానని, వినకుండా గెలిపించారని KCR పేర్కొన్నారు. తమ పాలనలో పది రోజుల పాలనలోనే రైతుబంధు వచ్చేదని.. ఇప్పుడు రెండు నెలలకు కూడా రెండు విడతలు రాలేని పరిస్థితి ఉందన్నారు. ఒక్కసారి వేయాల్సిన రైతుబంధును.. ఒక్కో ఎకరానికి వేస్తున్నారని విమర్శించారు. వేలం పాటలు పాడినట్లు.. పింఛన్లు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు.
Read Also: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

