కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నస్తూర్ పల్లిలో జరిగిన రైతు భరోసా సభలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డిని పెద్దమనిషి అని ఎందుకు పిలవాలని.. ఆ అర్హత కోల్పోయాడన్నారు. జీవన్ రెడ్డికి రాజకీయ బీక్ష పెట్టి మంత్రి పదవి ఇచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని వీడి నాదేండ్ల భాస్కర్ రావుతో చేరి మోసం చేశాడని.. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ పదవి కోసం జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడిగం చేశారని ఆరోపించారు. అలాంటి నాయకుడికి 14 సార్లు బీఫామ్ ఇమన్నారు. పార్టీ కార్యకర్తలు ఆయన వెనుక నిలబడి గుండెల మీద మోస్తే.. వాళ్ల గుండెలపై తన్నాడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: యూరియా యాప్తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్
Follow Us On : WhatsApp

