కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల కేంద్రం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ జీవన్ రెడ్డితో ఉన్న స్నేహం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు కేకలు వేయడం ప్రారంభించారు.. దీంతో కేసీఆర్ మరోసారి తన రీతిలో మాట్లాడారు. అల్లరి చేసే వారు ఎవరు మనోడా.. మందోడా అంటూ చమత్కరించారు. దీంతో ఒక్కసారిగా సభపై ఉన్న బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రజలు తెగ నవ్వుకున్నారు.
Read Also: ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp

