జీవన్ రెడ్డికి కీలక పదవి.. ప్రకటించిన కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి (Jeevan Reddy) చేరికతో జగిత్యాలలో ఆయన గెలుపు ఖాయమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఆయన్ను వెంటనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమిస్తున్నట్లు వేదికపై నుంచి ప్రకటించారు. అన్నాదమ్ముల మాదిరి.. పార్టీ కోసం పనిచేద్దామని ఇటీవల తనను జీవన్ రెడ్డిని కలిసినప్పుడు చెప్పానని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పనిచేయాలని కోరారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జీవన్ రెడ్డికి కీలక పదవి రాబోతుందన్నారు. జగిత్యాల యుద్ధం ఇక మీ వంతు అని.. తెలంగాణ యుద్ధం తన వంతు అని శ్రేణులను ఉత్సాహపరిచారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన కేసీఆర్… రాష్ట్రమంతా బాధ్యతలు నిర్వర్తించే పదవి జీవన్‌రెడ్డికి వస్తుందంటూ పరోక్షంగా మంత్రిని చేస్తానని వ్యాఖ్యానించారు.

Read Also: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>