కలం, వెబ్ డెస్క్: జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలని.. తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పిలుపునిచ్చారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో తన సుదీర్ఘ ప్రసంగం ముగిస్తూ.. జగిత్యాలకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. దాటుకుని ముందుకు వెళ్లాల్సిందేనని, పోరాటాలు చేయాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీడీ కార్మికులకు పింఛన్లు, యాదవులకు గొర్రెల వంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. ఇది ఎక్కువ కాలం సాగదని స్పష్టం చేశారు.
Read Also: మొదటి సంతకానికే హైడ్రాను ఎత్తిపడేస్తా: కేసీఆర్
Follow Us On : WhatsApp

