కలం, వెబ్ డెస్క్ : దేశానికి వెన్నెముక అయిన రైతును నిటారుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్ పల్లిలో నిర్వహించిన రైతు భరోసా సభలో ఆయన ప్రసంగించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులను నిర్మించిందన్నారు. దేశంలో తొలిసారి ఉచిత కరెంట్ విధానం తీసుకొచ్చింది తమ పార్టీనే అని గుర్తు చేశారు. ఉచిత కరెంట్, కనీస మద్దతు ధర, రైతు రుణమాఫి లాంటి అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. సమ్మక్క సారలక్క సాక్షిగా రెండు లక్షల రుణమాఫి చేస్తామని హామినిచ్చి.. రైతులను రుణవిముక్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: యూరియా యాప్తో రైతుల కాళ్లకు వాపులు: కేసీఆర్
Follow Us On : WhatsApp

