పీఎంజే జ్యువెలరీ దాడి బాధితులను పరామర్శించిన ఐజీపీ

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి (IGP Chandrasekhar Reddy) ఈరోజు క‌రీంన‌గ‌ర్‌ (Karimnagar)లో పీఎంజే జ్యువెల‌రీ దోపిడీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ​అనంతరం, ఐజీపీ స్థానిక ఆసుపత్రిని సందర్శించి, ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తూ, వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆయన వెంట కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.

Read Also: క‌రీంన‌గ‌ర్ దోపిడీ ఘ‌ట‌న‌.. గాయ‌ప‌డిన వారు సేఫ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>