కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి హత్య చేశారు. కాకినాడలోని (Kakinada) గాంధీనగర్ లో దుండగులు మద్యం తాగి ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై దాడికి దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

