ధ‌ర‌ణితో బీఆర్ఎస్ నేత‌ల భూ దోపిడీ: క‌డియం శ్రీహ‌రి

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ హ‌యాంలో ఆ పార్టీ నేత‌లు ధ‌ర‌ణిని అడ్డుపెట్టుకొని అడ్డ‌గోలుగా భూదోపిడీకి పాల్ప‌డ్డార‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి (Kadiyam Srihari) ఆరోపించారు. అసెంబ్లీలో క‌డియం మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వంద‌ల, వేల‌ ఎక‌రాల్లో భూములు క‌బ్జా చేశార‌ని చెప్పారు. బాలాన‌గ‌ర్‌లో భూ బ‌ద‌లాయింపులు ధ‌ర‌ణిని అడ్డుపెట్టుకొని చేశార‌ని, కంపెనీల‌ను బెదిరించి ఈ ప‌నులు చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నార‌న్నారు. దానిపై హౌస్ క‌మిటీ వేయాల‌ని, బీఆర్ఎస్ నేత‌ల భూదోపిడీని బ‌య‌ట‌పెట్టాల‌ని క‌డియం శ్రీహ‌రి డిమాండ్ చేశారు.

Read Also: కాళేశ్వరంపై విచారణ చేపట్టాకే.. మాకు సూచనలు ఇవ్వాలి: CM రేవంత్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>