కలం, స్పోర్ట్స్: అఫ్ఘానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కుటుంబంతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించాడు. భార్య సంజనా గణేశన్, కుమారుడు అంగద్తో ప్రయాణిస్తూ కెమెరాలకు చిక్కాడు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లను బుమ్రా ఒక అభ్యర్థన చేశాడు. సంజనా, అంగద్ ఫొటోలు తీయవద్దని కోరగా వారు అంగీకరించారు. దీంతో సంజనా వారికి ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత బుమ్రా కెమెరాల కోసం పోజులు ఇచ్చాడు. ఫొటోగ్రాఫర్లతో సరదాగా మాట్లాడిన అతడు ఉదయాన్నే అల్పాహారం చేసి కాస్త విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు.
అఫ్ఘానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్కు బుమ్రాకు (Jasprit Bumrah) విశ్రాంతి ఇచ్చారు. వచ్చే నెల ఇంగ్లండ్ పర్యటనలో జరిగే వైట్బాల్ సిరీస్తో అతడు మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2026 బుమ్రాకు కఠినంగా మారింది. 13 మ్యాచ్ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే సాధించాడు. అతడి స్థాయికి ఇది అరుదైన గణాంకం. ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. 14 మ్యాచ్ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించి జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది.

