కలం, వరంగల్ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో అధికారిక లాంఛనాల మధ్య శుక్రవారం రాత్రి కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ అధికారిక గౌరవ వందనంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

