epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఇరాన్​ భయం.. ఇజ్రాయెల్​ అణుపరీక్షలు?

కలం, వెబ్​డెస్క్​: ఇజ్రాయెల్​లో గురువారం ఉదయం 9గంటలకు భూమి కంపించింది (Israel Earthquake). దేశ దక్షిణ భాగంలోని నెగెవ్​ ఎడారిలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్​ స్కేల్​పై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో సైరన్లు మోగాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ కంపనలు దేశ కీలక నగరం జెరూసలేం వరకు పాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రికత్తలు నెలకొన్న సమయంలో ఈ కంపనలు రావడం ఆందోళన రేకెత్తించింది.

ప్రకంపనలు తక్కువ స్థాయిలో ఉండడంతోపాటు అదే సమయంలో దేశంలోని పాఠశాలల్లో మాక్​ డ్రిల్స్​ జరుగుతుండడంతో ఇవి అణుపరీక్షలు అని చాలా మంది సోషల్​ మీడియా వేదికగా అనుమానించారు. భూకంప కేంద్రం (Israel Earthquake) నెగెవ్​ ఎడారిలోని డిమోనా సమీపంలో ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కారణం, ఇక్కడ అణుపరీక్ష కేంద్రం ఉండడం. దీంతో ఇది కచ్చితంగా అణుపరీక్షే అని సోషల్​ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. మరోవైపు డిమోనా ప్రాంతం సిరియాకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే, అమెరికా తమ మీదకు దాడికి దిగితే తాము ఇజ్రాయెల్ ​ను లక్ష్యంగా ఎంచుకుంటామని ఇరాన్ (Iran)​ ప్రకటించిన నేపథ్యంలో ఇది కచ్చితంగా అణుపరీక్షే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

Read Also: తడబడినా బోణీ కొట్టిన యువ భారత్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>