Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీశైలం మల్లన్నకు చెంచుల ప్రత్యేక పూజలు.. ప్రత్యేకత ఇదే

కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో సంక్రాంతి బ్రహోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఉత్సవాల్లో స్థానిక చెంచులు ప్రత్యేకార్షణగా నిలుస్తుంటారు. మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తుంటారు.

స్వామి, అమ్మవార్లకు కళ్యాణ వేడకకు చెంచులు (Chenchu) భారీగా హాజరై కల్యాణం జరిపించారు. గిరిజనులను ఆచారాల ప్రకారం స్వామి వారికి పూజలు చేశారు. ఈ వేడుకకు దాదాపు  350 మంది హాజరయ్యారు. కేవలం శ్రీశైలంలో పరిధిలోనే కాకుండా నల్లమల ఫారెస్టులో ఆలయాల్లో చెంచులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సలేశ్వర ఉత్సవాల్లోనూ గిరిజనులే ఆలయ పూజారులుగా వ్యవహరించి పూజలు చేస్తుంటారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>