Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్‌కు కొత్త షాక్.. మ్యాచ్ తర్వాత వెంటనే అమెరికా వీడాలి!

కలం, స్పోర్ట్స్: ఇరాన్ (Iran) ఫుట్‌బాల్ జట్టుకు ప్రపంచకప్ ఆరంభంలోనే మరో అనుకోని ఇబ్బంది ఎదురైంది. న్యూజిలాండ్‌తో 2-2తో డ్రా చేసిన కొద్ది గంటల్లోనే జట్టు అమెరికాను (US) విడిచి మెక్సికోలోని తమ శిక్షణ కేంద్రానికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత సాధారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి, కోలుకునే సమయం ఇవ్వాలని జట్టు భావించింది. అందుకోసం కాలిఫోర్నియాలో ఒక రాత్రి ఉండాలని ముందుగా ప్రణాళిక వేసుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే అందరూ విమానం ఎక్కి టిజువానాకు వెళ్లాలని ఆదేశాలు వచ్చాయని ప్రధాన కోచ్ అమీర్ ఘలెనోయీ తెలిపారు.

ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో తమకు తెలియదని ఆయన చెప్పారు. జట్టు కోసం అవసరమైన ప్రణాళికలను ఇతరులు నిర్ణయిస్తున్నట్లుగా అనిపిస్తోందని, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఆటగాళ్ల కోలుకునే ప్రక్రియకు సమయం ఇవ్వకపోవడం తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై యుద్ధ చర్యలు ప్రారంభించిన తర్వాత నుంచి ఇరాన్ ప్రపంచకప్ సన్నాహకాలు గందరగోళంగా మారాయని సమాచారం.

తమ మూడు గ్రూప్ మ్యాచ్‌లను అమెరికా వెలుపల నిర్వహించాలని ఇరాన్ చేసిన అభ్యర్థనను ఫిఫా తిరస్కరించినప్పటికీ, టోర్నీలో పాల్గొనాలని ఆ దేశం నిర్ణయించింది. జట్టు కెప్టెన్ మెహ్దీ తరేమీ కూడా పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు, కోచింగ్ సిబ్బంది, మీడియా అధికారులతో పాటు పలువురు ముఖ్య సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించడంతో సన్నాహకాలు మరింత కష్టతరమయ్యాయని చెప్పారు.

ఈ పరిస్థితుల్లో ఫిఫా మరింత సహకారం అందించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ రెండు సార్లు వెనుకబడినా పోరాడి సమం చేసింది. 64వ నిమిషంలో మహ్మద్ మొహెబ్బీ చేసిన గోల్‌తో జట్టు డ్రాను సాధించింది. స్టేడియంలో ఇరాన్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అదే సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన ఇరానియన్-అమెరికన్లు కూడా కనిపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>