కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ కరెన్సీ రూపాయి (Indian Rupee) విలువ మునుపెన్నడూ లేని రీతిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ లో ఒక్కరోజే భారీగా క్షీణించి డాలర్ తో పోలిస్తే రూ. 94.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువకు డిమాండ్ పెరగడంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్దం కూడా రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 110 డాలర్ల మార్కును దాటింది.
దీంతో భారత్ లాంటి దిగుమతి దేశాల కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పడింది. అలాగే, భారతీయ స్టాక్ మార్కెట్ల (Stock Market) నుంచి విదేశి పెట్టుబడిదారులు తమ నిధులు వెనక్కి తీసుకోవడం కూడా రూపాయి (Indian Rupee) క్షీణించడానికి కారణంగా ఉంది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి డాలర్ తో పోలిస్తే 93–94 రూపాయల మధ్య ఉంది. ఈ క్రమంలో శుక్రవారం 86 పైసలు పతనమై 94.82 కు దిగజారింది. అయితే, రూపాయి విలువ బలహీనపడడంతో ముడిచమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: ‘ఇక్కత్’ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ
Follow Us On: Instagram

