Mobile Popup Ad
Mobile Popup Ad

ఇండియా గోల్ఫ్ ఛాంపియన్‌షిప్‌లో హోవ్‌లాండ్, ర్యాన్ ఫాక్స్!

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ వేదికగా అక్టోబర్ 15 నుంచి 18 వరకు జరగబోయే ప్రతిష్టాత్మక ఇండియా గోల్ఫ్ (Golf)  ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో పీజీఏ టూర్ విజేతలు విక్టర్ హోవ్‌లాండ్, ర్యాన్ ఫాక్స్ ఆడనున్నారు. 40 లక్షల యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీతో జరిగే ఈ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టామీ ఫ్లీట్‌వుడ్, రోరీ మెక్‌ఇల్రాయ్, జస్టిన్ రోజ్ వంటి ప్రపంచ స్థాయి స్టార్లతో వీరు తలపడనున్నారు.

నార్వేకు చెందిన విక్టర్ హోవ్‌లాండ్‌కు ఇది రెండో టోర్నమెంట్. గతేడాది ఇక్కడ ఆరో స్థానంలో నిలిచిన ఆయన.. భారత్‌లో తనకు లభించిన ఆతిథ్యం అద్భుతంగా ఉందని, మళ్లీ ఢిల్లీ వచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. మరోవైపు న్యూజిలాండ్ స్టార్ ర్యాన్ ఫాక్స్ భారతదేశంలో ఆడటం ఇదే మొదటిసారి. చారిత్రాత్మకమైన ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ కోర్సులో ఆడటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది ‘రేస్ టు దుబాయ్’ పోటీల చివరి దశలో ఈ ఇండియా ఛాంపియన్‌షిప్ ఎనిమిదో ఈవెంట్‌గా జరగనుంది. ఆ తర్వాత నవంబర్‌లో దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఒక మంచి వేదికగా నిలవనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>