టేబుల్ టెన్నిస్‌లో గోవా జోరు: దబాంగ్ ఢిల్లీని చిత్తు చేసి ఫైనల్‌కి!

క‌లం, వెబ్‌డెస్క్‌: అల్వారో రోబుల్స్ అద్భుత ప్రదర్శనతో డెంపో గోవా ఛాలెంజర్స్ (Dempo Goa Challengers) అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (UTT) సీజన్ 7 ఫైనల్లోకి అడుగుపెట్టింది. పనాజీలో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ TTC ని 8-2తో ఓడించి, ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే గోవా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.

పురుషుల సింగిల్స్‌లో స్పానిష్ ఒలింపియన్ అల్వారో రోబుల్స్ 3-0తో యూసఫ్ అబ్దెల్ అజీజ్‌ను ఓడించి గోవాకు శుభారంభం అందించారు. మూడో గేమ్‌లో 7-10తో వెనుకబడినప్పటికీ, రోబుల్స్ ఊహించని రీతిలో పుంజుకుని విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో మారియా షావో 2-1తో బెర్నాడెట్ సోక్స్‌పై గెలిచి ఢిల్లీకి ఊరట నిచ్చింది.

అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో రోబుల్స్, యువ క్రీడాకారిణి సిండ్రెలా దాస్ జోడీ 3-0తో ఢిల్లీ కెప్టెన్ సతియన్ జ్ఞానశేఖరన్, మారియా షావోలను ఓడించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆఖర్లో అభినంద్ పి.బి 11-9 తేడాతో సతియన్‌ను ఓడించడంతో గోవా విజయం ఖరారైంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన తొలి జట్టుగా గోవా చరిత్ర సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో అల్వారో రోబుల్స్ ఉత్తమ విదేశీ ఆటగాడిగా, సిండ్రెలా దాస్ ఉత్తమ భారతీయ ఆటగాడిగా పురస్కారాలు అందుకున్నారు. అజేయ రికార్డుతో ఫైనల్ చేరిన డెంపో గోవా ఛాలెంజర్స్, ఇప్పుడు టైటిల్ గెలవడానికి ఒక్క విజయం దూరంలో నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>