కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు మరో భారీ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ను బద్దలుకొట్టారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(Hyderabad DGGI) గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా అనుమతిలేని ఆన్లైన్ గేమింగ్ సైట్లను నిర్వహిస్తున్న రూ.13వేల కోట్ల విలువైన ఒక సిండికేట్ను గుర్తించినట్లు తెలిపింది. ఈ సిండికేట్ నెట్వర్క్కు ఆర్థిక కార్యకలాపాల విషయంలో కొన్ని ఫిన్టెక్ కంపెనీలు సహరించినట్లు వెల్లడించింది.
వీటిపైనా చర్యలు తీసుకున్నట్లు డీజీజీఐ (Hyderabad DGGI) తెలిపింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఖాతాల్లోని సుమారు రూ.100 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు చెప్పింది. అలాగే సిండికేట్లోని కొంతమందిని ఈ నెలలోనే అరెస్ట్ చేశామని పేర్కొంది. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ విచారణలో భాగంగా ఓ ప్రైవేట్ కంపెనీ ఫౌండర్, డైరెక్టర్ అయిన పంకజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
Read Also: ఫ్లయింగ్ కిస్ ఇస్తే జైలుకే.. ముంబై కోర్టు సంచలన తీర్పు
Follow Us On: X(Twitter)


