ఐపీఎల్​ సీజన్​.. సీపీ సజ్జనార్​ కీలక విజ్ఞప్తి

కలం, వెబ్​ డెస్క్ : ఐపీఎల్​ (IPL 2026) సీజన్​ ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్​ సీపీ సజ్జనార్ (CP Sajjanar)​ క్రికెట్​ అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. బెట్టింగ్ ఊబిలో పడి బతుకును ఛిత్రం చేసుకోవద్దని కోరారు. క్రికెట్​ ను కేవలం క్రీడలాగే ఆస్వాదించాలని.. బెట్టింగ్​ లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్​ కోరారు. గతంలో బెట్టింగ్​ పై ప్రచారం నిర్వహించే వందలాది యాప్​ లను నిషేధించామన్నారు.

అయితే, ఇప్పుడు టెలిగ్రామ్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​ లాంటి సోషల్​ మీడియా వేదికగా బెట్టింగ్​ దందా కొత్త రూపం దాల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసం బెట్టింగ్​ యాప్​ లను ప్రమోట్​ చేసే సోషల్​ మీడియా ఇన్​ ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఆన్​ లైన్ పై​ మాత్రమే కాకుండా ఫామ్​ హౌజ్​ లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్​ లైన్​ బెట్టింగ్​ పై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు. బెట్టింగ్​ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరారు. ఎవరైనా బెట్టింగ్​ పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటన్​ డయల్​ 100 లేదా వాట్సాప్​ నంబర్​ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ (CP Sajjanar) సూచించారు.

Read Also: CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్.. IPL మ్యాచ్ లకు ధోని దూరం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>