epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెరిసిన హర్మన్​ప్రీత్​.. ముంబైదే గెలుపు

కలం, వెబ్​డెస్క్​: కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్ (Harmanpreet Kaur) అజేయ అర్ధసెంచరీ​ (71; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​లు)తో మెరవడంతో మహిళల ప్రీమియర్​ లీగ్​(డబ్ల్యూపీఎల్​)లో ముంబైకి రెండో విజయం దక్కింది. మంగళవారం ముంబైలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా గుజరాత్​ జెయింట్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో ముంబై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన గుజరాత్​ జెయింట్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జార్జియా వేర్​హామ్​(43 నాటౌట్​; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​), కనిక అహుజా(35; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్​లు), బెత్​ మూనీ(33; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్​) రాణించారు. ఆఖర్లో భారతి ఫుల్మాలి(36 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్​లు) షాట్లు దంచేసింది. ముంబై బౌలర్లలో షబ్నిం ఇస్మాయిల్​, హీలీ మ్యాథ్యూస్​, నికోలా కేరీ, అమెలియా కెర్​ తలో వికెట్​ తీశారు.

అనంతరం ఛేదనలో హర్మన్​ప్రీత్​కు తోడు అమన్​జ్యోత్​ కౌర్​(40; 26 బంతుల్లో 7 ఫోర్లు), నికోలా కేరీ (38 నాటౌట్​; 23 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో మరో నాలుగు బంతులు ఉండగానే ముంబై విజయం అందుకుంది. గుజరాత్​ బౌలర్లలో రేణుకా సింగ్​, కష్వీ గౌతమ్​, సోఫీ డివైన్​ తలో వికెట్​ తీశారు. హర్మన్​ప్రీత్ ​కు ‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​’ దక్కింది.కాగా, డబ్ల్యూపీఎల్​లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు తలపడగా అన్ని సార్లూ ముంబైనే నెగ్గింది.

Harmanpreet Kaur
Harmanpreet Kaur

Read Also: భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయిన పాకిస్తాన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>