కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు (Indur) నగరంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో (శంభుని గుడి) సోమవారం సాయంత్రం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా హారతి ఇచ్చారు. చైర్మన్ బింగి మధు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు మహాశివుడుని దర్శించుకున్నారు. ఆలయం మొత్తం ఓం నమః శివాయ, హరహర నామస్మరణతో మార్మోగింది.

