కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డిలో (Kamareddy) మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహావీర్ జయంతి (Mahavir Jayanti) వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోని మార్వాడీ ధర్మశాలలో మహావీర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్వడీ సంఘం అధ్యక్షుడు ఆర్.బి నరేశ్ చంద్, ప్రధాన కార్యదర్శి బోర ప్రదీప్ జైన్, ఉప అధ్యక్షుడు దిలీప్ చంద్, కోశాధికారి మహేశ్ కుంచ, ఉపకార్యదర్శి ఓం చంద్ పాల్గొన్నారు.

