కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ అధికారి కాంట్రాక్టర్పై దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో చోటు చేసుకున్నది. బిల్లులు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్పై సదరు అధికారి బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కలెక్టరేట్లోని ఏపీఏవో (APAO) ఫణి భూషణ కశ్యప్ .. కాంట్రాక్టర్ వీరేందర్ మధ్య గత చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయి. బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్లను వేధిస్తుండడంతో సదరు APAOపై గతంలో వీరేందర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి వీరి మధ్య గొడవ జరిగింది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న అధికారి తన టేబుల్ మీద వస్తువులతో కాంట్రాక్టర్ మీద దాడి చేశాడు. అతడి మొహంమీద తీవ్రమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
-భూపాలపల్లి కలెక్టరేట్లో అధికారి వీరంగం
– పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరిన కాంట్రాక్టర్ వీరేందర్ పై ఏపీఏఓ ఫణి భూషణ కశ్యప్ భౌతిక దాడి!
-టేబుల్పై ఉన్న వస్తువులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో కాంట్రాక్టర్ ముఖంపై తీవ్ర గాయాలు
-భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… pic.twitter.com/YOBkGKOaUC— Kalam Daily (@kalamtelugu) March 27, 2026
Read Also: మహిళా వైద్యుల వేధింపులు.. ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నo
Follow Us On : WhatsApp

