కలం, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్ల విషయంలో చమురు సంస్థలు మళ్లీ షాక్ ఇచ్చాయి. మరోసారి సిలిండర్ల (Gas Cylinder) బుకింగ్ గడువును పెంచాయి. డబుల్ సిలిండర్ ఉన్న వారు 35 రోజుల తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలని కొత్త రూల్ తీసుకొచ్చాయి. సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వినియోగదారులకు మాత్రం సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచడంతో వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఈ పథకం కింద ఉన్న వినియోగదారులకు పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే రూల్ వర్తిస్తుందని చమురు కంపెనీలు తెలిపాయి.
Read Also: రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ నాటకం : దినేష్ కులచారి
Follow Us On: Youtube

