కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్కు (Adilabad) చెందిన యువకుడు లండన్ యువతిని పెళ్లి (Marriage) చేసుకున్నాడు. ఆదిలాబాద్ పట్టణం కృష్ణానగర్కు చెందిన సాయిచరణ్ పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు లండన్లోని (London) కార్డిఫ్కు చెందిన మియామేతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఈ జంట హిందూ సంప్రదాయం ప్రకారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. విదేశీ యువతి భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఆదిలాబాద్ యువకుడిని పెళ్లాడటం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.

