ప్రధాని మోదీ ప్రకటన.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

కలం, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలని ప్రధాని మోదీ (PM Modi) చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. “పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని మాత్రమే ప్రధాని చెప్పారు. అవకాశం ఉన్న చోట మెట్రోలో ప్రయాణించాలని కోరారు. అలాగే దూరపు ప్రయాణాల కోసం, పార్సిళ్లు పంపించడానికి రైళ్లను వాడుకోవచ్చు. అవకాశం ఉన్న చోట ఎలక్ట్రానిక్ వాహనాలను కూడా ఉపయోగించాలని సూచించారు. చమురు వినియోగం తక్కువ చేయడం వలన దేశంపై ఉన్న భారాన్ని కొంత మేర తగ్గించినట్లవుతుందని చెప్పడమే ప్రధాని ఉద్దేశం” అని కేంద్ర పెట్రోలియ, గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>