కలం, వెబ్ డెస్క్: ఏపీ (AP)లో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS Officers Transfers) చేస్తూ ఉత్తర్వులు వెలువడ్దాయి. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్గా సురపాటి ప్రశాంత్కుమార్ నియామకమవ్వడంతో పాటు రంపచోడవరం ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైఖోమ్ నిడియా దేవి నియామకం అయ్యారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా శుభమ్ నోఖ్వాల్ నియామకమయ్యారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా వైశాలిని నియమించారు. బదిలీ అయిన బచ్చు స్మరణ్రాజ్ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించారు.

