కలం, వెబ్డెస్క్: కేరళ (Kerala) రాష్ట్రం త్రిస్సూర్ (Thrissur)లోని బాణ సంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనం కాగా.. 40 మంది గాయాలపాలయ్యారు. ఉత్సవాల కోసం బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

