కలం, మెదక్ బ్యూరో : ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంపై రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం పందిళ్ళ గ్రామ ఐకేపీ సెంటర్ వద్ద సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల రాస్తారోకోతో సిద్ధిపేట- హుస్సాబాద్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

