epaper
Wednesday, February 18, 2026
epaper

నేడు రాష్ట్రానికి ప్రెసిడెంట్​ ద్రౌపది ముర్ము రాక

కలం, వెబ్​ డెస్క్​ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండురోజుల పాటు ఆంధ్రప్రదేశ్​ లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం నేవల్ ఎయిర్​ స్టేషన్​ ఐఎన్​ఎస్​ డేగా వద్ద ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ల్యాండ్ అవుతారు. నేవల్​ బేస్​లో నిర్వహించే విందులో పాల్గొని రాత్రి ఇక్కడే బస చేస్తారు. అలాగే ఈ నెల 18 నుంచి విశాఖపట్నంలో జరగనున్న ఇంటర్నేషనల్​ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్​ఆర్​)లో భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో పాల్గొంటారు. ద్రౌపది ముర్ముతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్ కూడా ఏపీలో పర్యటించనున్నారు.

గవర్నర్​ జస్టిస్​ నజీర్​, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ రాష్ట్రపతికి (Droupadi Murmu) స్వాగతం పలికేందుకు విశాఖ వెళ్లనున్నారు. ఆర్కేబీచ్​ ఐఎఫ్ఆర్​ సందర్భంగా నౌకాదళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్​ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Read Also: తొర్రూరులో హై టెన్షన్.. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>