కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ లక్ష్యంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. శాంతియుత మార్గంలో సమస్యల పరిష్కారానికి అవకాశం ఉన్నందున ఈ కఠిన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గేందుకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరితే ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
Read Also: 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం: ఆ కీలక నేత ఎవరు?
Follow Us On : WhatsApp

