కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఆకినీడులో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆకినీడు రామాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishnam Raju)ను ఓ వర్గం వారు అడ్డుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఆకివీడులో రామాలయానికి సంబంధించి చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ రామాలయాన్ని పున: నిర్మిస్తామని రఘురామకృష్ణం రాజు గతంలో పేర్కొన్నారు. అయితే ఆ స్థలం తమ ప్రార్థనాస్థలానికి చెందినదని మరో వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఘర్షణ మొదలైంది.
శ్రీరామనవమి సందర్భంగా ఆకినీడు రామాలయంలో పూజలు చేసేందుకు రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnam Raju) వెళ్లగా మరోవర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఆకివీడు పెద్దపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ ఘర్షణల్లో ఇద్దరు గాయపడగా వారిని భీమవరం ఆస్పత్రికి తరలించారు.

